శ్రీ సత్యసాయి జిల్లా
విశాలాంధ్ర పెనుకొండ
పెనుకొండ పట్టణ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితఆధ్వర్యంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 300 రోజులు పూర్తి చేసుకోవడంతో సవితని ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. అనంతరం సవితమాట్లాడుతూ అన్నదానం సామాజిక ధర్మం.అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టమైనది. జానెడు పొట్టకు గుప్పెడు మెతుకులుఅన్నార్తుల ఆకలి తీర్చాలి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో యువనేత నారా లోకేష్ మార్గదర్శకత్వంత పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5రూపాయలకే రుచికర మైన భోజనం 300 వ రోజులు పూర్తీ చేసుకోవడం తో ఎంతో ఆనందంగా ఉందని తెలియ చేసిన సవిత ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .