కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగనాథ నారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: నాటి ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో తమ ఓట్లను సద్వినియోగం చేసుకోవడం శుభదాయకమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వత్థనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని నేసేపేట 193 పోలింగ్ బూత్ కేంద్రంలో తమ ఓట్లను వేసి సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ అక్కడక్కడ వైసిపి నాయకులు యొక్క దాడులు చేయడం హేయమైన చర్య అని తెలిపారు. పోలీసులు కూడా ఓటర్లకు సహాయ సహకారాలు అందించడంలో వారు సఫలీకతురు అయినారని తెలిపారు. కానీ ఓటర్ల వద్ద కనీస సౌకర్యంతో పాటు తాగునీరు లేకపోవడం పట్ల ఓటర్లు ఎన్నో ఇక్కట్లకు ఎదురు కావడం జరిగిందని తెలిపారు. అధికారులు ముందస్తు చర్యలుగా మరింత చర్యలు చేపట్టి ఉంటే చాలా బాగుండేదని వారు తెలిపారు. ఓట్లు వేసిన వారిలో అభ్యర్థి రంగనాయక నారాయణ భార్య అనూష, కుమారుడు ఆర్.వి వర్డ గణేష్ కూడా ఉన్నారు..