Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

గ్రామాలలో బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్ ఎన్నికల ప్రచారం!

విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం ఉమ్మడి జనసేన టీడీపీ కూటమి బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్ శనివారం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ధర్మవరం మండలం గొట్లూరు, మల్లేని పల్లి తుమ్మల, తిప్పేపల్లి, సుబ్బారావు పేట ప్రాంతాలలో ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ తో కలిసి జనసేన తరుపున ధర్మవరం అరిగెల భాస్కర్, సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్బంగా బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ,గ్రామీణ సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తామన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని, ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలు నిజం చేయాలంటే నిజాయితీ కల పార్టీ బీజేపీనే దేశానికి రక్షణ అని ఈ పార్టీ ని జరగనున్న ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలని వారు ఈ సందర్బంగా గ్రామీణ ఓటర్ల ను అడిగారు.ఉమ్మడి జనసేన, టీడీపీ పార్టీలు మద్దతు తో ధర్మవరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్ విజయం కోసం అందరూ సమిష్టి గా కృషి చేయాలని జనసేన పార్టీ తరుపున ధర్మవరం అరిగెల భాస్కర్ పిలుపు నిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమం లో కోలా నాగార్జున, రాజ్ ప్రకాష్, అంజి, అఖిల్, చిలకల సుధాకర్, బాలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img