Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఈనెల 28న ధర్మవరంలో జరిగే ఎస్టీల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి..

బిజెపి జిల్లా అధ్యక్షులు.. జిఎం. శేఖర్
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 28న ధర్మవరంలో జరిగే ఎస్టీల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు జి.ఎం శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్డీఏ ఎన్నికల కార్యాలయంలో ధర్మవరం అసెంబ్లీలోని 25 తండాల ఎస్టీ ముఖ్యమైన నాయకులతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం అసెంబ్లీ స్థానానికి 52 సంవత్సరాల తర్వాత ఒక బీసీ వ్యక్తికి బిజెపి టికెట్ కేటాయించడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్న సత్యకుమారుని గెలిపిస్తే ధర్మవరం నియోజకవర్గం తప్పక అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. కావున ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎస్టీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేసు, జిల్లా సంయోజక రమణమూర్తి,జింక చంద్రశేఖర్, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్, జోనల్ ఇంచార్జ్ హరినాయక్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఆనంద నాయక్, కృష్ణయ్య ,పోతులయ్య, హరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img