Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: పేదల ప్రజలకు మంచిగా సేవలందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కదిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ ప్రజలకు తెలియపరిచారు. శనివారం నంబుల పూలకుంట మండలంలోని మర్రికొమ్మదిన్నె పంచాయతీ జవకుల, నల్లగుట్టపల్లి, ఎర్ర వంకల వారి పల్లి, మరికొమ్మదిన్నె , నేరేడు చెరువు హరిజనవాడ గ్రామాలలో వైసిపి నాయకులు గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఓటర్లు మా మీద చూపించే ప్రేమ, ఆత్మీయతకు నిదర్శనమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పేర్కొన్నారు. గడపగడపకు ప్రచారానికి వచ్చిన వైసిపి నాయకులకు అడుగడుగునా మహిళలు హారతులు బట్టి స్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపులతో ఆశీర్వదిస్తున్న అవ్వతాతలతో పాటు గ్రామాలలోని ప్రజల మా ఓటు జగనన్నకే వేస్తామని వారి ముఖంలోని చిరునవ్వే చెబుతోందన్నారు . ఇచ్చిన మాటకు కట్టుబడి అందరిని 99 శాతం హామీలను అమలు చేసిన జగనన్నకు 600 హామీలు ఇచ్చి మ్యానిఫెస్టో డిలీట్ చేసిన చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇంతటి ప్రజాధరణ కలిగిన జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇప్పుడు ఇచ్చిన దానికంటే రెండింతలు సంక్షేమాన్ని పేదలకు అందిస్తాడంటూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, సింగల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, యువ పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు,సర్పంచ్ రంగానిభారతమ్మ, జే సి ఎస్ కన్వీనర్ ఆదిరెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, షామీర్ భాషా, తిరుమల నాయుడు, గ్రామ కన్వీనర్ వెంకటేష్ ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img