Monday, May 6, 2024
Monday, May 6, 2024

ప్రజలకు మంచి చేసే నాయకుని ఎన్నుకోండి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలకు మంచి చేసే నాయకుని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్బిఐ కాలనీలో గల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 38వ వార్డు ఇంచార్జ్ చాంద్ బాషా ఆధ్వర్యంలో 2 65 కుటుంబాలు, 41 వార్డు ఇంచార్జ్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో 65 కుటుంబాలు టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడని, ఆ ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. అంతేకాకుండా ధర్మవరం నియోజకవర్గానికి కావలసిన నిధులను సమకూర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడం జరిగిందని తెలిపారు. కొన్ని పార్టీలు అభివృద్ధిని ఓర్వలేక బురద చల్లడం మానుకోవాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు మాత్రమే బాగుపడతారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1.60 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోనే 1.04 లక్షల ఇల్లు ఉంటే 97 వేల ఇళ్లను ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ధర్మవరంలో ఇంత అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కేతిరెడ్డి మాత్రమే చేశారని, ఎందుకు ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని తెలిపారు. పార్టీలో చేరిన వారందరూ కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, మరోసారి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యే కేతిరెడ్డి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ శంషాద్ బేగం, పట్టణ అధ్యక్షుడు కోటిరెడ్డి బాల్రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు ఉడుముల రామచంద్ర, కత్తే పెద్దన్న ,శ్రీనివాసులు, వరలక్ష్మి, చాంద్ బాషా మూర్తి, పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img