Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రతి విద్యార్థికి కళాశాల దశ జీవితములో కీలకమైనది.. ప్రిన్సిపాల్ కె.. ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి విద్యార్థికి కళాశాల దశ జీవితములో ఎంతో కీలకమైనదని ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల దినోత్సవ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రిన్సిపాల్ విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతు ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు గొప్ప స్థాయిలో స్థిరపడ్డారు అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి జీవితం లో కళాశాల దశ కీలకమైనది” ఆ దశలోనే విద్యార్థి బాధ్యతయుతంగా తీర్చిదిద్దబడుతాడు అన్నారు. సమాజంలో భాగ స్వామిగా మారడం ఈ సందర్భం లోనే జరుగుతుంది అని,కాబట్టి విద్యార్థులు తమ జీవితాలను స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దుకొని, కళా శాలకు గౌరవం తెచ్చి పెట్టాలని ఆశాభావం వ్యక్తం చేసారు. మిగిలిన ఇతర వక్తలు తమ ప్రసంగాలలో విద్యార్థులు ఇష్టం గా చదివి, మంచి ఫలితాలు పొందాలని తెలుపుతూ విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపారు.ఇందులో భాగంగా విద్యార్థులు సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి సీనియర్ విద్యార్థులకు, జానియర్ విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డా॥ ఎస్. షమీఉల్లా, డా.బి. గోపాల్ నాయక్, వి హైమవతి ,ఎ.కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి యం.వెంకటలక్ష్మి, యం పుష్పవతి. వై. తాహీర్ .యం.సరస్వతి, బి. ఆనంద్ .ఏ.సౌజన్య లక్ష్మీ ,బి. గంగా తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img