విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ధర్మవరం ఆర్టీసీ డిపో జిల్లాలో మంచి గుర్తింపును పొందింది. ఈ సందర్భంగా ప్రతి నెల అత్యధిక డీజిల్ ఆదా చేసిన వారిని డిపో మేనేజర్ సత్యనారాయణ అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నెలలో అత్యధిక డీజిల్ ఆదాచేసిన డ్రైవర్లు వి. ఆంజనేయులు, ఎం. నారాయణ, వైవి. రాముడు లను డిపో మేనేజర్ సత్యనారాయణ తో పాటు ఇతర అధికారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి డ్రైవర్లను మిగిలిన డ్రైవర్లు స్ఫూర్తిగా తీసుకొని డిపో ఆదాయానికి సహకరించాల్సిన అవసరము, బాధ్యత ఎంతో ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంతో పాటు, గౌరవ మర్యాదలతో పలకరించడం ఆర్టీసీ ఉద్యోగుల యొక్క మొదటి ప్రధాన కర్తవ్యం అని వారు తెలియజేశారు. ఇందులో వి.ఆంజనేయులు డ్రైవర్-134.79 డీజిల్ లీటర్లు ఆదా చేశారని, ఎం. నారాయణ-115 లీటర్లు, వైవి.రాముడు 83 లీటర్లు ఆదా చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ధర్మవరం డిపోకు చెందిన పలువురు డ్రైవర్లు ఇప్పటికే మంచి గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. డిపోలో పనిచేసే డ్రైవర్లు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని కే ఎం పి ఎల్ తీసుకొని రావాలని వారు విజ్ఞప్తి చేశారు.