విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కెపిటి వీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరకత నంది విగ్రహాన్ని ఆర్యవైశ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణామూర్తులు మరకత మహానందికి వివిధ రకాల అభిషేకాలతో పాటు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ 200 సంవత్సరాల కిందట మరకతమణి నంది విగ్రహం లభించగా వారు పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతపురం గుత్తి రోడ్డులో కామాక్షి దేవాలయాన్ని నిర్మించి నందిని ప్రతిష్ట చేస్తామని తెలిపారు తెలపడం జరిగిందన్నారు. ఈ మరకత మహానంది జిల్లాలో భక్తాదులకు దర్శనం కలిగించి తిరిగి ప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మవరంకు రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ మరకత మహానందిని దర్శించుకునేందుకు వందలాదిమంది భక్తాదులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, కోశాధికారి ఓ. వి. ప్రసాద్, మహిళా మండలి అధ్యక్షురాలు రూపా రాగిణి, కోశాధికారి మంజు సంయుక్త తో పాటు ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలు, పట్టణ భక్తాదులు పాల్గొన్నారు.