విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని దుర్గమ్మ ఆలయము, పాండురంగ స్వామి ఆలయము, శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయాలకు సంబంధించిన హుండీ లెక్కింపు కార్యక్రమం ఈనెల 21వ తేదీ గురువారం ఏర్పాటు చేశామని ఆలయ ఈవో వెంకటేశులు పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హుండీ లెక్కింపు లో వచ్చిన ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి హుండీలపైన వచ్చే ఆదాయం ఎంతో ప్రాధాన్యత చేకూర్చుతుందని తెలిపారు.