ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: క్రీడలు ప్రతి వ్యక్తికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని, క్రీడలు ఆడితే అనారోగ్యాలు దరి చేరవు అని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పట్టణంలోని బిఎస్సార్ గర్ల్స్ హై స్కూల్ ముందువైపు గల ఇండోర్ స్టేడియంలో కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. రాకెట్ పట్టి క్రీడాకారులను ఎంతో ఉత్సాహపరిచారు మంత్రి. అదేవిధంగా తోటి క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని కూడా కనపరచడం అందరిని ఆకట్టుకున్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని ప్రజలకు వారు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ తమకు వీలున్న సమయంలో క్రీడలను ఆడాలని తెలిపారు. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. అనంతరం బ్యాడ్మింటన్ క్రీడాకారులు తో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధనవంతుగా ఇండోర్ స్టేడియం కు సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం క్రీడాకారులు పాల్గొన్నారు.