Friday, May 3, 2024
Friday, May 3, 2024

నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి కవిత..

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లోని నామినేషన్ కేంద్రంలో మూడవ రోజు శనివారం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం డి. చెర్లోపల్లి కు చెందిన దాసరి కవిత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డికి అందజేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నామినేషన్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులలో నామినేషన్ స్వీకరించే బడదని తెలిపారు. నామినేషన్లు వేసేవారు నాలుగు సేట్లు వేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల అభ్యర్థులకు హెల్ప్ అండ్ డిస్క్ అనే సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 26న నామినేషన్ పరిశీలన, 29వ తేదీన నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు. కావున నామినేషన్ వేసే అభ్యర్థులు పై విషయాలను గమనించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img