విశాలాంధ్ర ధర్మవరం:: కుష్టి వ్యాధి పై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత వారి సిబ్బంది దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏలుకుంట్ల గ్రామ పంచాయతీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు లెప్రసీ ఎలా వస్తుంది? వ్యాధి లక్షణాలు? వ్యాధి రాకోకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. స్పర్శ కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టి వ్యాధి నిర్మూలన పక్షోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కుష్టి వ్యాధి లక్షణాలలో కాళ్లల్లో బలహీనత, చేతివేళ్లలో బలహీనత, కళ్ళు మూసుకుపోవడంలో ఇబ్బంది, శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరుపు రంగుతో కూడి ఊపినట్లుగా ఉన్న మచ్చలు, లావుగా, నొప్పిగా లేక జూమ్ కలిగినటువంటి నరములు, లేప్రా రియాక్షన్ అనునవి లక్షణాలు అని తెలిపారు. తెలిపారు. పై లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని పరీక్షతోపాటు చికిత్స అన్ని ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కళావతి, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి , ఎమ్మెల్ అప్రోజ్ ,సర్పంచు గంగమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.