ధర్మవరం ఇన్చార్జ్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి భూదప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల తొమ్మిదిన అమరావతిలో చలో అమరావతి వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ధర్మవరం ఇంచార్జ్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి- ఎస్. బుదప్ప వికలాంగుల అధ్యక్షులు అయ్యప్ప రెడ్డి తెలిపారు. అనంతరం వారు స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మహా గర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ సభలో మాదిగల సమస్యల పోరాటానికై తీర్మానాలను కూడా నిర్వహిస్తారని తెలిపారు. పోరాట సమితి పోరాటం వలన గతంలో 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ 500 రూపాయలు కావడం జరిగిందని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పిలుపునిచ్చారు. కావున ఈ మహా గర్జనకు వీహెచ్పీఎస్ కార్యకర్త అనుబంధ విభాగాల కార్యకర్తలు, గ్రామ కమిటీలు డివిజన్ నియోజకవర్గ కమిటీలు, జిల్లా రాష్ట్రస్థాయి కమిటీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, మహిళ, సాంస్కృతిక ఉద్యోగ, యువజన విభాగాల కార్యకర్తలు, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్ సెట్ కొట్టాల భాష నారాయణమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు, తాడిమర్రి రామాంజనేయులు, ఎంఎస్పి సజ్జల రామాంజనేయులు, సాకే చెన్నయ్య, పూజారి పెద్దన్న, యాదగిరి, అవినాష్, రామకృష్ణ ,పుల్లన్న, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.