Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లను పంపిణీ

విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు రావల చెరువు సురేష్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది. తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక భారతదేశానికి పితామహుడు అని, 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి కావడం, శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. అందుకే మే 21న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గా నిర్వహించడం కూడా జరుగుతోందని తెలిపారు. రాజీవ్ గాంధీ కలలు, దృష్టి, ఆయన నిబద్ధత, భారతదేశాన్ని ప్రపంచ నాయకుడుగా మార్చడం జరిగిందని తెలిపారు. సాంకేతిక టెలికాం వికేంద్రీకరణ పై అతని విప్లవాత్మక ఆలోచనలు భారతదేశంలో చిత్రాన్ని మార్చాయని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనాల కొరకు ఎన్ఎస్యుఐ ఎల్లప్పుడూ ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండారు చైతన్య, నాయకులు నరేష్, రామాంజనేయులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img