Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి…

జిల్లా తెలుగుదేశం పార్టీ తొగట వీర క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు పరిసే సుధాకర్
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ తొగట వీర క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు పరిసే సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో పద్మశాలి ఒకే కుటుంబములో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, రాష్ట్రములో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతుడు సుబ్బారావు చేనేత కార్మికుడిగా ధర్మవరంలో జీవనం కొనసాగిస్తున్నాడని రెవెన్యూ అధికారుల కారణంగా శనివారం ఉదయం ఆయన భార్యా పద్మావతి కుమార్తె వినయ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. చేనేత కార్మికుడు సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్ మరణానికి పాల్పడడం జరిగిందని తెలిపారు. చేనేత కార్మికుల ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు అన్యాయం చేసిన అధికారులను చట్ట ప్రకారం వదిలి పెట్టేది లేదని, వారి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబానికి ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img