విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సాయి నగర్లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో అర్చకులు బాబాకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం బాబా ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం లో 150 మందికి పంపిణీ చేస్తున్నామని, కేవలం గురువారం రోజున 300 మంది అనాధలకు పేద వాళ్లకు అన్నదాన కార్యక్రమాన్ని దాతల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాబాను వివిధ పూలమాలలతో, వివిధ ఆభరణాలతో అలంకరించిన వైనం భక్షాతులను విశేషంగా ఆకట్టుకుంది. కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు నాంది పలుకుతున్నామని తెలిపారు. పేదలకు ఆర్థిక సహాయం అందించుట, పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించుట లాంటి పలు కార్యక్రమాలలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అందులకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి, పలు కార్యక్రమాలకు దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు తెలిపారు. ఆలయానికి ఎవరైనా విరాళాలు అందించాల్సి ఉంటే నేరుగా ఆలయ కార్యాలయమునకు సంప్రదించాలని తెలిపారు. దాతల సహాయ సహకారములతోనే ప్రతి సంవత్సరము ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రతి దాతకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు.