ఆలయ అభివృద్ధి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తత జ్ఞానబోధ సభా ట్రస్ట్, అర్చకుల, భక్తాదులు, దాతలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు భగవత్ ప్రార్థన, విశ్వకేశన ఆరాధన, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, దీపారాధన, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. తదుపరి రెండవ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు పుణ్యాహవాచనం, ద్వారా తోరణ ధ్వజ కుంభ పూజ, ఆరాధన, మూలమంత్ర, అష్ట బలిహరణ హోమాలు అర్చకులు సుదర్శన ఆచార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు, వారి శిష్య బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి గరుడ వాహనంతో స్వామి వారిని పట్టణ పురవీధులలో ఊరేగించారు. పెద్ద శేష వాహన ఉభయ దాతలు లక్ష్మీదేవి, సీతారామయ్య-సీతారామయ్య జూనియర్ కళాశాల అధినేత, గరుడ వాహన దాతగా బయనగారి సుకుమారి బయనగారి నాగరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల పేరిటన అర్చకులు కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు. అర్చకులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి పాంచ రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కమిటీ సభ్యులు మెడికల్ కుల్లాయప్ప దత్త శివ బిల్లే నాగప్ప సాగా సురేష్ శంకర సంజీవులు రంగా శీనా బుద్ధికి రామాంజనేయులు, బాల, నాగేంద్ర, స్వామివారి వాలంటీర్స్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.