జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మారంకు ఎమ్మెల్యే టికెట్ను జనసేన పార్టీకే ఇవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరంలో వైసీపీని గద్దె దించాలంటే తప్పనిసరిగా జనసేనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ధర్మారంలో వైసీపీ చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొంటూ పోరాటాలను చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.. ఆ సమస్యలను పరిష్కరించాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మవరం టికెట్టును టిడిపి బిజెపికి కేటాయిస్తే ఒకరినొకరు ఓడించుకుంటారని పైగా వైసీపీ వ్యతిరేక ఓటు చీల్తాయని తెలిపారు. మరి ఇట్లాంటి సమయంలో వైసీపీ గెలవడం మంచిదా? అని వారు ప్రశ్నించారు. కావున ధర్మవరం టికెట్టు జనసేన పార్టీకి ఇస్తే టిడిపి బిజెపి రెండు పార్టీలతో వైశాల్యాలు లేవు అని, తనకు సహకరిస్తారని వారు తెలిపారు. తాను టిడిపికి, బిజెపి లకు వ్యతిరేకము కాదని వారు స్పష్టం చేశారు. కావున చంద్రబాబు నాయుడు పురందేశ్వరి పవన్ కళ్యాణ్ ను మరోసారి ఆలోచించి విచారణ చేపట్టి ధర్మవరం టికెట్టును జనసేన పార్టీకే ఇవ్వాలని వారు తెలిపారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని వారు స్పష్టం చేశారు.