విశాలాంధ్ర ధర్మవరం: మండల పరిధిలోని నేలకోట పంచాయతీలోని బిల్వంపల్లి గ్రామంలో త్రాగునీరు సరఫరా సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా గ్రామానికి త్రాగునీరు అందించే బోర్లు ఎండిపోవడంతో నీరు ఆరా కొరగా వస్తున్నాయని వారు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా నీటి కోసం మహిళలు గ్రామంలోని నీళ్ల ట్యాంకుల వద్ద గంటలు తరబడి నిరీక్షించిన కూడా నీరు రావడంలేదని వాపోయారు. అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోకపోవడంతో మా సమస్య తీర్చేవారు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం ఉండడంతో నీటి కొరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ప్రతి వేసవికాలం ఇలాగనే మా సమస్యలు అపరిస్కృతంగా ఉంటున్నాయని తెలిపారు. కావున అధికారులు నీళ్ల ట్యాంకులతో మా గ్రామానికి నీరు సరఫరా చేసి, తమ దాహార్తిని తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. అట్లు లేనియెడల బిందెలతో ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.