ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర రావు
విశాలాంధ్ర -ధర్మవరం ; మా హక్కులను కాల రాస్తే ఎదురు తిరిగి పోరాటం చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎన్జీవో హోములో ఏర్పాటుచేసిన బీసీల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత బీసీ సంక్షేమ సంఘం నాయకులు కదిరి గేటు వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి, కాలేజ్ సర్కిల్ మీదుగా ఎన్జీవో హోం కు ర్యాలీగా వెళ్లి తమ నినాదాలను హోరెత్తించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరావు మాట్లాడుతూ బీసీ నాయకుల బీసీల సమస్యలపై వారు చర్చించడం జరిగిందని తెలిపారు. బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన వారి హక్కుల భంగం వాటిల్లకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సహాయ సహకారాలు అందిస్తే, స్వాగతిస్తామని తెలిపారు. మరి వారి హక్కులను కాల రాస్తే ఎదురు తిరిగి పోరాటం చేయడానికి అయినా వెనకాడే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోబిసి సంఘం నాయకురాలు జయశ్రీ,రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘం సెక్రటరీ చింతా నాగరాజు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకర్,రజిక వత్తిదారుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు బద్దలాపురం నరసింహులు,వాల్మీకి సంఘం సీనియర్ నాయకులు బోయ రవిచంద్ర, బీసీ సంక్షేమ సంఘం టౌన్ సెక్రెటరీ జంగం, వైస్ ప్రెసిడెంట్ రేగాటిపల్లి రవి, జాయింట్ సెక్రెటరీ తిరుపాల్, బండి వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.