Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సమాజంలో మహిళలే ముందంజలో ఉన్నారు.. కరెస్పాండెంట్.. డోలా పెద్దిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: నేడు సమాజంలో మహిళలు ముందంజలో ఉన్నారని కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం డోలా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని గురించి, ప్రేమను గూర్చి వారి వివరించారు. సృష్టికి మారుపేరు మహిళలు, సమాజ సృష్టికి మూలం మహిళలే అని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు ముందంజలో ఉంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. కళాశాలలో అధ్యాపకులుగా మహిళలే ఎక్కువ ఉన్నందున వారందరికీ కూడా కరస్పాండెంట్ ఘన సన్మానం నిర్వహించారు. తదుపరి వ్యాసరచన పోటీలను నిర్వహించి, ప్రధమ, ద్వితీయ బహుమతులను అందజేశారు.
శ్రీ నాగార్జున ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో ఘనంగా కిడ్స్ కాన్వా కేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ఆంజనేయులు యాజమాన్య బృందంతో, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులతో విలువైన క్రమశిక్షణతో కూడిన విద్యా విధానంతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని వారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img