పిల్లల్ని చిత్ర హింసలు చేసి విషం తాగించి, రెండు తలుపులకి మేకులు కొట్టి…
విశాలాంధ్ర సంతబొమ్మాలి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం, మలగాం పంచాయతీ, కుముందానవానిపేట గ్రామానికి చెందిన ఓ కసాయి రక్కసి తల్లి తన కడుపులో పుట్టిన కన్న కొడుకుల కే విషమిచ్చి చంపిన విషాదకర సంఘటన పరిసర ప్రాంతాలను కలచివేచింది. ఇద్దరి పిల్లలకు ఎలుకలు మందు గ్లాసుల్లో పోసి తాగమని బలవంతం చేస్తే, వద్దు అని పిల్లలు మోరాయించిన కొట్టి , కరచి తాగించి చంపింది. ఇదిలా ఉండగా ఆ క్రమంలో బయటకు వెళ్ళిపోతారని రెండు తలుపులకు మేకులు కొట్టారని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఆరు, ఏడు సంవత్సరాలు పసిపిల్ల లు మృతి చెందడంతో, కుముందానవానిపేట విషాద సముద్రంలో మునిగిపోయింది. దీంతో పాటు రాజమండ్రి నెల్లూరు గ్రామాల్లో ఉన్న బంధువులు మంగళవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారిస్తుంది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన గొర్జంగి దుర్గ సోమవారం రాత్రి సమయంలో కొడుకులకు ఎలుకలు మందు త్రాగిన తర్వాత నిద్రపోయారు. మంగళవారం ఉదయం, దుర్గ సోదరుడు హరి, ఆ ఇంటికి వెళ్ళి ఇంతవరకు పిల్లలు నిద్ర లేవలేదని, స్కూలుకు వెళ్తారు కదా నిద్ర లేపేందుకు వెళ్ళారు. తలుపులు విర్గగొట్టి తెరిచే సరికి పిల్లలు మృతి చెందారు. పిల్లల మరణ వార్త అతి వేగంగా గ్రామం తో పాటు పరిసర గ్రామాలకు పాకింది. దీంతో ఇటువంటి కసాయి తల్లికి సెంట్రల్ జైలుకు పంపించాలని గ్రామస్తులు బంధువులు నిర్ణయించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆరు సంవత్సరాల వయస్సు ఋషి, ఏడు సంవత్సరాల వయస్సు గల బాలు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే ఆమె భర్త రాజు కూలీ నిమిత్తం వంట చేసుకునేందుకు వంట మనిషిగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అదును చూసిన ఆమె తన బిడ్డలని చంపే కసాయిగా మారింది. సంతబొమ్మాలి మండలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి పిల్లల శవాలను పంచనామా జరిపి, కోటబొమ్మలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నబిడ్డలను చంపిన తల్లిని పోలీసులు తీసుకువెళ్లి కోర్టుకుఅప్పజెప్పారు.