Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కేంద్రమంత్రి కృపారాణి

విశాలాంధ్ర సంతబొమ్మాలి( శ్రీకాకుళం) : టెక్కలి నియోజకవర్గం మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసారు. డాక్టర్ కృపారాణి తో పాటు ఆమె భర్త డాక్టర్ రామ్ మోహన్ రావు, సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గుప్తాలకు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కృపారాణి గత కొంతకాలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత ఐదు సంవత్సరాలు కాలం సరైన గుర్తింపు లేకపోవడం వలన, కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసినదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img