విశాలాంధ్ర – టెక్కలి ( శ్రీకాకుళం) : టెక్కలి నియోజకవర్గం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావుకు అడుగున స్వాగతం పలికి మంగళ నీరాజనాలతో సామాన్య ప్రజలుతో పాటు పలువురు ఆహ్వానించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అధినాయకుడు, వ్యవస్థాపకుడు జేడీ లక్ష్మీనారాయణ ఐపిఎస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రప్రథమంగా భావనపాడు, సున్నపల్లి, పాతమేఘవరం, గద్దలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించడమే జేడీ లక్ష్మీనారాయణ ప్రథమ కర్తవ్యం అన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంతో పాటు, ఇతర కార్యక్రమాల్లో డబ్బు పంపిణీ, మందు పంపిణీ వంటివి పూర్తిగా వ్యతిరేకమని, ఇటువంటి నిజమైన నీతికే, నిజాయితీకి ప్రజలు పట్టం కట్టాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు జై భారత్ పార్టీ యువసేన యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.