Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఘనంగా హోమియో పితామహుడు శామ్యూల్ హానీమాన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర-కవిటి:మండలంలోని జగతి గ్రామంలో హోమియో పితామహుడు శామ్యూల్ హానీమాన్ 269 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జగతి శివాలయం ఆవరణంలో ఉన్న శ్యాముల్ హనీమాన్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ పూడి వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియో వైద్యంతో దీర్ఘకాల రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భావన సీతారామ్మూర్తి నాయుడు,పూడి జగదీశ్వరరావు,ముద్దపు తేజేశ్వరరావు,శమళ్ళ పద్మనాభం,లమ్మత తవిటయ్య,లమ్మత ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img