Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

టార్చిలైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి


జై భారత్ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి

విశాలాంధ్ర సంతబొమ్మాళి ( శ్రీకాకుళం) : జై భారత్ నేషనల్ పార్టీకి చెందిన బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జై భారత్ జాతీయ పార్టీ టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బైపెల్లి పరమేశ్వరరావు ఓటర్లును కోరారు. బుధవారం కోటబొమ్మలి మండలం కోటబొమ్మలి గ్రామ మెయిన్ వీధుల్లో, కొత్తపేట లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు, యువకులు, మహిళలు, రైతంగం తో పాటు అన్ని వర్గాల ప్రజలకు జై భారత్ పార్టీ వ్యవస్థాప కులు జాతీయ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా ఆదుకుంటారని అన్నారు. ఈ మేరకు ఇంటింటా ప్రచారం చేసి జై భారత్ ఎజెండాతో కూడిన కరపత్రాలను వాటర్లకు అందజేసి అధికారం లోకి వేస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలును వివరించారు. అభ్యర్థి పరమేశ్వరరావు తో పాటు జై భారత్ జాతీయ పార్టీ యువకులు, స్థానిక ప్రజలు, మహిళలు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img