Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

సత్కారం బాధ్యతను పెంచింది


విశ్రాంత విఆర్వో జగన్నాథం

విశాలాంధ్ర-కవిటి:ఉగాది సందర్భంగా గ్రామస్తులు తనకు చేసిన సత్కారం మరింత బాధ్యతను పెంచిందని విశ్రాంత విఆర్వో బార్ల జగన్నాథం అభిప్రాయ వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బెజ్జిపుట్టుగ గ్రామంలో శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామివారి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు,పీవీఎస్ రాంబాబు, విశ్రాంత విఆర్ఓ గొండ్యాల రామ్మూర్తి,సోంపేట మండలం వ్యవసాయ అధికారి బొర్ర నరసింహమూర్తి,బి ధనుంజయం,బి మోహనరావు, పి జానకిరామయ్య,పి కృష్ణారావు తోపాటు పలువురు గ్రామస్తులు విశ్రాంత విఆర్ఓ బార్ల జగన్నాథం కు ఘనంగా సత్కరించి స్వామి వార చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త పొందల.కృష్ణారావు మాట్లాడుతూ గ్రామం తో పాటు ఆలయ అభివృద్ధికి సహకరించిన విశ్రాంత విఆర్వో జగన్నాథం సేవలు మరువలేనివని అన్నారు.గత రెండు సంవత్సరాల నుండి ఉగాది పురస్కారాల్లో భాగంగా గ్రామం కు విశేష సేవలు అందించిన వారికి సన్మానించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉగాది రోజున విశ్రాంతి విఆర్ఓ జగన్నాథంకు సత్కరించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పి నారాయణ మూర్తి,ఆర్ సత్యనారాయణ, బి మధు,అర్చకులు సత్యం స్వామి,రాజేష్ స్వామి,రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img