Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆ నలుగురి కే వీలునామా,,,!

*సర్వ శిక్ష కమీషన్ కే కాంట్రాక్ట్
*మెనూ మాటేమిటి
*ఆకట్టుకోవడంలో వారు దిట్ట


విశాలాంధ్ర – ఆముదాలవలస (శ్రీకాకుళం) : అధికారులతో ఎంతటి పని అయినా ఇట్టే చేయగల చాకచక్యం ఆ నలుగురికి ఉంది అనేది జగమెరిగిన సత్యం. హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు జిల్లాలోని భోజనం పెట్టే ప్రక్రియ నుంచి ఆయా పాఠశాలలకు కావలసిన కూర గాయలు పాలు అరటి పళ్ళు అన్ని అందించ డంలో వారిది అంద వేసిన చేయి. జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 14 మోడ ల్ స్కూలుకు, 25 కేజీబీవీ పాఠశాలలకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలు ఆ నలుగు రు చేజిక్కించుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.55 మంది టెండర్ లో పాల్గొంటే ఆ నలుగురికే అందించడంపై విమ ర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన వారు కూడా జిల్లా కలెక్టర్కు వారికి జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్ లో వివరించుకున్నారు. ఎల్ వన్ (లీస్ట్ టెండర్) పేరిట వారు దక్కించుకున్నట్లు అధికారులు విన్నవిస్తున్నారు. పాలు, చికెన్, గుడ్డు వంటివి ఆరోజు పేపర్ దొరికే వాటి న్యాయ పాఠశాలలకు అందించాల్సి ఉంటుం ది. అది కూడా ఎల్ వన్ అంటూ అధికారు లు చెప్పటం పలు అనుమానాలకు తావి స్తోంది. గత మార్చిలో క్రియ పూర్తి అయిన ప్పటికీ ఆ నలుగురు ఆధ్వర్యంలో పాత వారు ఇచ్చిన రేట్లు కే నీ గురించి చూస్తాను డిసెంబర్ వరకు సరుకులు అందించారు. రాజకీయ ప్రలోభాలకు లోబడి కూరగాయలు గుడ్లు పాలు ఒకరికే అందించటం వెనుక రాజకీయ హస్తం ఉందని వెల్లడవుతుంది. ప్రభుత్వం ఏదైనప్పటికీ విరే గుత్తేదారులుగా వ్యవహరిస్తారు. అంటే వీళ్ళ రాజకీయ పలుకుబడి ఎంతో అవగతం అవుతుంది. నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వేసి నవంబర్ 27న గుత్తే దారుల పేర్లు విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి ఆయా కాంట్రాక్టర్లు ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలకు సరుకులు అందిస్తున్నారు.39 పాఠశాలలకు ఒకరి అందించడం కారణంగా మెనూ పాటించడంలో వారు విఫలమయ్యారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు అధికారులతో మంతనాలు చేస్తూ విద్యార్థులను ఎండ కడుతున్నారు. సర్వ శిక్ష అభియాన్ లో జరిగిన ఈ ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిషన్లు కక్కుర్తిలో విద్యార్థు లకు ప్రభుత్వం అందించిన మెనూ అందిం చలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్ప టికే వారికి కాస్మోటిక్స్ చార్జీలు అందడం లేదు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో భోజ నం చేసేందుకు కూడా సరైన కూరలు లేక పోవడం, అక్కడ పనిచేస్తున్న వార్జనులు కూడా పట్టించుకోకపోవడం విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఓ వి పేట మోడల్ స్కూల్లో వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న ట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. ఉన్నతా ధికారుల తనిఖీల లో కూడా రికార్డులు సక్రమంగా లేవని మందలించిన సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్టర్ తమకే వేయమన్నారని కాలపర్తికి చెందిన ఒక గుత్తేదారు కూరగాయ లు వేస్తుంటే, ఆముదాలవలసకు చెందిన మరో గుత్తేదారు ఆ కాంటాక్ట్ తనకే అందిం దని ఒకరోజు కూరగాయలు వేశారు. కూర గాయలు ఇరువురు వేయడంతో గందరగోళం మొదలైంది. ప్రస్తుతం ఏ ఒక్కరు కూడా వారి కి కూరగాయలు అందించడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందు తున్నారు.
మెనూ మాటే లేదు,,,,,,
పేదరికం, ఆకలితో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ ఏర్పాటు చేసి ఆరోజు తప్పనిసరిగా ఆ కూరగాయలతో భోజనం పెట్టాలని ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంత మంది వాటిని పక్కదారి పట్టించి పబ్బం గడుపు తున్నారన్న విమర్శలు ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులకు పాలు తాగమని ఇస్తే వాటిని ఉపాధ్యాయులు టీ కాఫీలు చేసుకొని మిగి లిన వాటిని విద్యార్థులకు అందిస్తుంటా రు. ఈ టీ పొడి, రూములు క్లీన్ చేసేందుకు ఫినాయిల్, చీపురు, బ్లీచింగ్ వంటి వాటిని ఈ గుత్తేదారులు వారికి అదనంగా అందిస్తా రు. దీంతో మెనూ పాటించకపోయినప్పటికీ సరిపడా సరుకులు వేస్తున్నట్లు సర్టిఫికెట్ అందిస్తారు. దీంతో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మెనూ అందడం లేదన్న విమ ర్శలు ఉన్నాయి.
ఆ కట్టుకోవడంలో వారు దిట్టలు,,,,,
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ఆకట్టుకోవడంలో వారికి వారే సాట్ అని తెలుస్తుంది. టెండర్ లేకుండా ఏడాదికాలంగా వారే నెట్టుకొచ్చారు.అలా నెట్టుకొచ్చినందుకు కృతజ్ఞతగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు డి‌ మత్యులేస్యం వద్ద విందు వినోదాలతో పిక్నిక్ ఏర్పాటు చేయటం అధికారుల కాసుల కక్కుర్తికి అర్థం పడుతుంది. నెలకు సుమారు 68 లక్షల రూపాయలు బిల్లుల రూపంలో చెల్లిస్తారు. కనీస పర్యవేక్షణ ఉండదు, వీటన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి పిక్నిక్ లు వీరు ఏర్పాటు చేసి అధికారులను వసు పరుసు కుంటారు.
మోనూ లో వీటిని విధిగా అందించాలి,,,,,
రోజు వారీ మోను ప్రకారం వంకాయలు, దొండ కాయలు, బెండకాయలు, క్యారెట్, వంటివి కిలో 25 రూపాయలకే అందించాలి. బంగాళ దుంప, టమాటా33కి క్యాబేజీ 27 కు, బీట్రూట్ మూడు రూపాయలకు, అల్లం 15 కు, పచ్చిమిర్చి 30, చిక్కుడుకాయలు 10, ఆనపకాయలు 22 రూపాయలకు అందించేందుకు టెండర్లు గుత్తేదారులు కోడ్ చేసినట్లు తెలిసింది. చికెన్ గుడ్లు పాలు ఆరోజు పేపర్ వరకు అందించాలి.55 మంది పాల్గొన్న ఈ టెండర్లు సర్వ శిక్ష అభియాన్ ఏపీసి, జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో టెండర్ తెరవవలసి ఉన్నప్పటికీ చీకటి కోణంలో పేర్లు ప్రకటించారని టెండర్ లో పాల్గొన్న గుత్తేదారులు వాపోతున్నారు. ఈ టెండర్లలో ప్రతి ఏటా తాను దక్కించు కోవ డంలో అందవేసిన చేయిగా మారింది. లీస్టు ఎంతైనా సరే అతనికే టెండర్ దక్కాలి అన్న ఉద్దేశంతో రాజకీయంగా పావులు కదుపు తారని విమర్శలు ఉన్నాయి. గతంలో వలె 25 కేజీబీవీలకు 14 మోడల్ స్కూల్ కు అరుకులు అందించేందుకు ప్రాంతాలవారీగా ఈ 55 మందికి అవకాశం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలకు కూరగాయలు అందించేందుకు టెండర్లు ప్రక్రి యలో అవకతవకలు జరిగాయని అనుమా నాలు ఉన్నాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏ పి సి జయప్రకాష్ కు వివరణ కోరగా విలేకరులు ఫోన్లో వివరణ కోరకూడదని టెండర్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరి గిందని మా ఖాళీ సమయంలో ఆఫీసుకు వస్తే మొత్తం ఫైలు మీకు చూపిస్తామని తెలిపారు
ఫోటో,,,, కేజీబీవీ స్కూల్ తాళ్ళ వలస.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img