Monday, May 20, 2024
Monday, May 20, 2024

రైతుల విషయంలో కలెక్టర్‌ అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు

హైకోర్టు
వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్‌ యాక్ట్‌లో ఏమైనా చేర్చరా అని హైకోర్టు ప్రశ్నించింది.యాసంగి వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్‌ చేసిన వాఖ్యలపై హైకోర్టు విచారణ నిర్వహించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టర్‌, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు… కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్‌ యాక్ట్‌లో ఏమైనా చేర్చరా అని ప్రశ్నించింది. అలాంటిది ఏమీ లేదని ఏజి బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో కలెక్టర్‌ అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కలెక్టర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img