Monday, May 20, 2024
Monday, May 20, 2024

సైదాబాద్‌ ఘటన దారుణం..

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్‌
సైదాబాద్‌ కాలనీలో చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.ఈ ఘటన దారుణమని, అత్యంత దురదృష్టకరమనీ పేర్కొన్నారు. పది పోలీస్‌ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నూతన మహబూబాబాద్‌ జిల్లా నూతన సమీకృత కలెక్టర్‌ కార్యాలయం నిర్మాణం పనులు, మెడికల్‌ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ పనులు త్వరగా కావాలని ఆర్‌ అండ్‌ బి కి అప్పగించాం. రూ.30 కోట్లతో నర్సింగ్‌ కాలేజీకి టెండర్‌ పూర్తి అయ్యిందని మంత్రి తెలిపారు.సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, నర్సింగ్‌ కాలేజీ, కొత్త కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభం చేయడానికి పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img