Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులకు టోకరా

*ఆనాడు మెగా DSC….ఈనాడు దగా DSC.

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షంశుల్ హాక్, కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్ బాష లు విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు గురువారం విజయవాడలో చలో సచివాలయం ముట్టడి కార్యక్రమానికి ఆళ్లగడ్డ తాలూకా నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లారు.. ఈ సందర్భంగా షంశుల్ హాక్, హుస్సేన్ భాష లు మాట్లాడుతూ చలో సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్లనివ్వకుండ పోలీసులు విచక్షణ రహితంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మహానేత YSR 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…వారసుడు గా చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ” అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడని, 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఎన్నికలకు నెలన్నర ముందు డీఎస్సీ కింద 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటన్నారు. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. వైయస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ? రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ? మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా అని విమర్శించారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నజీర్ బాష, ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img