Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం

నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెలుగుదేశం అధినేత సతీమణి నారా భువనేశ్వరి గురువారం రాత్రి హలిగేర గ్రామంలో పర్యటించారు. హలిగేర గ్రామంలో గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మృతి చెందిన టిడిపి కార్యకర్త ఉరుకుందప్ప కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి మృతుడి భార్య బోయ శేషమ్మకు 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ముందుగా మృతుడు బోయ ఉరుకుందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 27 సెప్టెంబర్ 2023 వ తేదీన హాలిగేర గ్రామంలో బోయ ఉరుకుందు(42) మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందడం జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న సందర్భంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ మా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని నింపిందని, టిడిపి కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామన్నారు. నేడు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని త్వరలోనే బాబుతో మంచి పాలన మొదలవుతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పత్తికొండ టిడిపి భాద్యులు శ్యాంబాబు, ఆదోని టీడీపీ మాజీ బాధ్యులు కృష్ణమ్మ, మీనాక్షి నాయుడు, ఆలూరు టిడిపి మాజీ బాధ్యులు వైకుంఠం మల్లికార్జున చౌదరి, శశిసుధ, జ్యోతి, టీడీపీ తాలూకా నాయకులు వంశి రెడ్డి, మండల కన్వీనర్ పరమారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, మాజీ ఎంపీపీలు కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నౌనేపాటి చౌదరి, ఎంపీటీసీలు రహీంతుల్లా, నరసన్న, మాజీ ఎంపీటీసీలు రామాంజనేయులు, జేమ్స్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img