Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంపై నిరంతర కృషి

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జిల్లా వైఎస్ఆర్సీపీ అద్యక్షుడు శత్రుచర్లలు
విశాలాంధ్ర,పార్వతీపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28న మన్యం జిల్లాలోని కురుపాం నియోజక వర్గంలో అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభంకు వస్తున్న నేపథ్యంలో  గత పది రోజులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మాజీ డిప్యూటీ సిఎం,కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజులు తెలిపారు.మంగళ వారం తన క్యాంప్ కార్యాలయంలో కలిసిన విశాలాంధ్రతో మాట్లాడారు. తమ నియోజక వర్గంలోప్రభుత్వ కార్యక్రమం ప్రారంభం చేయడానికి సీఎం రావడం తనకుఎంతో సంతోషంగా ఉందన్నారు. మన్యం జిల్లా ఏర్పాటు చేసిన తరువాత మొదటి సారి తన నియోజక వర్గంకు రావడంతో తాను అహర్నిశలు శ్రమించి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎంపర్యటనకు తనతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులు,
అభిమానులు గతవారంరోజులుగా నిరంతర పర్యవేక్షణతో రాత్రనక పగలనక కష్టపడి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర సమయములో కూడా అప్పట్లో ఆయనకు కురుపాం నియోజక వర్గంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రేపటి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్న సీఎం జగన్ కు అదే విధంగా ఆశీస్సులు అందించడానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. తల్లులు,మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి సీఎం జగన్ కు ఆశీస్సులు అందించడానికిఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అమ్మఒడి కార్యక్రమాన్ని ఖరారుచేసాక వాతావరణం కూడా అనుకూలంగా మారిందన్నారు.వాతావరణం చల్లబడి మీటింగుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తారని తెలిపారు.రాష్ట్రంలో ఈశాన్య దిక్కున కురుపాం నియోజక వర్గంలోని కురుపాం ఉండటంతో ఇక్కడ జరిగే సమావేశం నూటికి నూరుపాళ్లు విజయవంతం కావడం ఖాయమని పలువురు చెప్పడం గమనార్హం. సభాస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్ర్తి చేసారని, హెలిప్యాడ్ నుండి సభాస్టలి వరకు రోడ్లకు ఇరువైపుల జనాలు పెద్ద ఎత్తున స్వాగతం పలికే చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనతో కురుపాం నియోజకవర్గ  అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ సందర్శన చేయనున్నారని తెలిపారు.బుదవారం ముఖ్యమంత్రి సమావేశం అనుకున్న సమయానికి ప్రారంభమయి నిర్ణీత సమయంలోగా ముగుస్తుందని తెలిపారు. మరో 24గంటలు వాతావరణం అనుకూలంగా ఉండాలని, సీఎం పర్యటన విజయవంతం కావాలన్నదే జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు కురుపాం నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img