విజయనగరం జిల్లా.రాజాం : ఈరోజు 10వ “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు రాజాం పురపాలక సంఘం పరిధి సారధి మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్రధానోపాధ్యాయులు మరియు పిల్లలతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మధుసూదనరావు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క విశిష్టతను, దాని ప్రయోజనాలను పిల్లలకి వివరించడం జరిగిందన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ గురించి ప్రతిపాదన చేయగా మొత్తం 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు తమ పూర్తి మద్దతు తెలియజేశారన్నారు, అనంతరం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన “అంతర్జాతీయ యోగా దినోత్సవం” జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది అన్నారు, మన భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఖ్యాతి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి దక్కుతుందన్నారు.