విశాలాంధ్ర,సీతానగరం: అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ బలగ రవణమ్మ తెలిపారు.మంగళవారం మండలంలోని నిడగల్లు గ్రామసచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమములో ఆయన మాట్లాడారు.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎంపిపి చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.
ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి బాబ్జీ, వైస్ ఎంపిపి తోడబండి సూర్యనారాయణ ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, సర్పంచ్ ఆరుద్రమ్మ, ఆర్ ఐ శ్రీనివాసరావు,ఎంఈఓ సూరిదేముడు, వెలుగు ఏపిఎం శ్రీరాములు, హౌసింగ్ ఏఈ జానకీరాం, నాయకులు గాజాపు శ్రీనివాసరావు, పరవాడ తిరుపతిరావు, సెక్రటరీ తిరుపతిరావు, విఆర్ఓ మోహిని, సచివాలయం సెక్రటరీ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు.