నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు
విశాలాంధ్ర విజయనగరం టౌన్ నగరంలో వీధి దీపాల సక్రమ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఐడిఎస్ఎంటి కాంప్లెక్స్ కార్యాలయంలో ఉన్న వీధి దీపాల పరికరాల పరిస్థితిని గమనించారు.ప్రజలు, కార్పొరేటర్ల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా తగిన సామాగ్రి సిద్ధంగా ఉందా లేదా అని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. వీధులలో విద్యుత్ దీపాలు వెలగలేదని ఫిర్యాదులు అందిన వెంటనే ఏర్పాటు అయ్యే విధంగా చూడాలన్నారు. విద్యుత్ దీపాలు మరమ్మత్తులకు గురైనట్లయితే తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజెప్పాలన్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎంఎం నాయుడు మాట్లాడుతూ నగరంలో వీధి దీపాలు సమస్యను తక్షణమే పరిశీలించేందుకు చొరవ చూపుతున్నామన్నారు. ప్రజల నుండి గాని, స్థానిక కార్పొరేటర్ నుండి గాని వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించి ఫిర్యాదుదారులతో సంతకాలను తీసుకునే విధంగా సిబ్బందికి ఆదేశించామన్నారు.