విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో గురువారంనాడు జరిగిన ముడుపుల పూజలకు వేకువజాము నుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఓం నమో శ్రీలక్ష్మి నరసింహస్వామినేనమః అంటూ పూజలు చేశారు.ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, మురారీలు ఆద్వర్యంలో ప్రత్యేకపూజలు చేస్తున్నారు.స్వామివారిని రకరకాల పూలతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రతీగురువారం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మినరసింహస్వామీ ముడుపుల పూజలకు
దూరప్రాంతాలనుండి వాహనాలతో భక్తజనం పెద్దఎత్తున విచ్చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలను చేసి స్వామివారిని దర్శించుకుని, గోవింద గోవింద, జైశ్రీలక్ష్మినరసింహ, ఓంనమో నారాయణాయ అంటూ 27సార్లు ప్రదక్షిణలు చేశారు.కొత్త,పాతభక్తులు కలిపి పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ఉండి పూజలు నిర్వహిస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుందని,జరగాలని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతీ గురువారం స్వామివారిని వివిధరకాల పూలతో అలంకరించినతీరు, భక్తుల ప్రదర్శనలు,పూజలు, ప్రసాదాలు స్వీకరించడం తదితర అంశాలను భక్తులు కలిసికట్టుగా చేయడం గమనార్హం