విశాలాంధ్ర,సీతానగరం: గ్రామాల్లోని ఓటరు జాబితాల పరిశీలన, హౌసింగ్ మ్యాప్ పై టీడీపీ నాయకులు ప్రత్యేకశ్రద్ద తీసుకొని పనిచేయాలని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పిలుపు నిచ్చారు.మంగళ వారం సీతానగరం మండల బూతు ఇంచార్జిలకు, గ్రామపార్టీ అద్యక్షులకు ఓటర్ల జాబితా పరిశీలన, హౌసింగ్ మ్యాప్ పై శిక్షణకార్యక్రమంను జోగమ్మపేట గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అదేశాలు మేరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా పలుఅంశాలను వివరించి రానున్న సాధారణ ఎన్నికలలో టీడీపీ క్యాడర్,నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు కొల్లి తిరుపతి రావు గారు, సెక్రటరీ రౌతు వేణుగోపాలనాయుడు, గొట్టాపు వెంకట నాయుడు, క్లస్టర్ ఇంఛార్జి బొమ్మినాయుని లక్ష్మణరావు, అరకు పార్లమెంటు కార్యదర్శి టంకల శ్రీనివాసరావు, బూత్ ఇంఛార్జి బొమ్మినాయుని శ్రీనివాసరావు, సాల హరిగోపాల్, బుడితి శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు , ఉడమల సూర్యనారాయణ,గుంపస్వామి, వెంకటనాయుడు, యోగేశ్వరరావు,సింహాచలం, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.