విశాలాంధ్ర -బుక్కరాయసముద్రం: జిల్లా పోటీలలో గెలుపొంది
ఏలూరు జిల్లా నూజివీడు లో అంతర్ జిల్లాల యు-18 జూనియర్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ కు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బుక్కరాయసముద్రం విద్యార్థిని బి.కీర్తన (పదవ తరగతి విద్యార్థి) ఎంపికైనట్లు పిడి గోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు వసుంధర, పిడి,లలితమ్మ అభినందించి రాష్ట్రస్థాయిలో కూడా విజయకేతరం ఎగరవేయాలని కోరారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు వసుంధర మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కీర్తన ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో విజయ పలాలను సాధించాలన్నారు.