విశాలాంధ్ర-తాడిపత్రి: పెద్దపప్పూరు మండలంలో శ్రీకృష్ణదేవరాయలు గుడిలో శనివారము ఎమ్మార్పీఎస్ నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈనెల ఆరవ తేదీన తాడిపత్రి నియోజక వర్గం పెద్దపప్పూరు మండలంలో ఎమ్మార్పీఎస్ సన్నాహక సభ విజయ వంతం చేద్దామని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు టి.ఆదినారాయణ, పెద్దిరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మునంగి నాగరాజు మాదిగ విచ్చేస్తున్నారు. ప్రతి గ్రామం నుండి యువత, విద్యార్థులు ఎమ్మార్పీఎస్ నాయకులు కదిలి రావాలన్నారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగలంతా అతి త్వరలోనే చలో హైదరాబాద్ కు మాదిగ ఉపకులాలతో లక్షలాదిమంది తరలి రావాలని మహాసభను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సివి. రవి మాదిగ, కంబగిరి మాదిగ, మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు.