విశాలాంధ్ర-తాడిపత్రి : ముచ్చుకోట గ్రామ ప్రజలు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలని ఆర్డిఓ మధుసూదన్ రెడ్డి ప్రజలకు సూచించారు. శనివారం ముచ్చుకోట గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డిఓ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చుకోట గ్రామంలో నివసిస్తూ ఏవైనా సర్టిఫికెట్ల లేక టెక్నికల్ సమస్యలుండి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులు ఉన్నట్లయితే అట్టివారికి జగనన్న సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేయ నున్నారు. గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది తమ ఇంటి వద్దకే వచ్చి తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం చేసే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం కింద సర్టిఫికెట్లు అందజేస్తారని చెప్పారు. అనంతరం జగనన్న సురక్ష సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లక్ష్మీ నాయక్ ఎంపీడీవో బి రామకృష్ణ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి ఈఓఆర్డి కమలా భాయ్ డిప్యూటీ తాసిల్దార్ మహబూబ్ బాషా పంచాయితీ సెక్రెటరీ సుబ్బరాయుడు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.