విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని యల్లనూరు రోడ్డు సమీపంలో ఉన్న తిక్క రామయ్య స్వామి మఠం భూమి అన్యాక్రాంతమైనది. ఈ భూమిని ఎండోమెంట్ శాఖ అధికారులు స్వాధీన పరచుకొని తిక్క రామయ్య స్వామి మఠానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా కళ్యాణ మండపం నిర్మించాలని ఎమ్మార్పీస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ఆధ్వర్యం లో ఈనెల ఆరవ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఎండో మెంట్ అధికారులకు పత్రికా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిక్క రామయ్య స్వామి మఠం సంబంధించి దాదాపు కోట్లు విలువ చేసే భూమి దాదాపు రెండు ఎకరాల 82 సెంట్లు అన్యాక్రాంతమైనది. 2017 సంవత్సరం నుండి ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో అధికారులకు వింత పత్రాలు, ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టాము. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం ఈనెల ఆరవ తేదీన రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. తిక్క రామయ్య స్వామి మఠం అన్యాక్రాంత మైన భూములు తిరిగి తిక్క రామయ్య స్వామి మఠానికి చెందే అంతవరకు రిలే నిరాహార దీక్షలు విరమింపబోమని అధికారులను హెచ్చరించారు. ఎమ్మార్పీస్ నాయకులు చంద్రశేఖర్, ధనుంజయ, రామకృష్ణ, గిత్త రాజు, జనార్ధన్ పాల్గొన్నారు.