జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆకస్మికంగా సోమవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు.జగనన్న సురక్ష కార్యక్రమం కింద టోకన్లు రైజ్ అయిన వారికి సర్వీసులు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, నెల రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారని, దానిని అన్ని సచివాలయాల్లోనూ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమం కింద రైజ్ అయిన టోకెన్లకు సంబంధించి సర్వీస్ లను అందించాలన్నారు. అర్హత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అలాంటి వారికి లబ్ధి చేకూర్చాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అందే సేవల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇంటింటా అవగాహన కల్పిస్తూ తెలియజేయలన్నారు. ఈ కార్యక్రమం కింద అందించే 11 రకాల సేవలు గురించి పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయం పరిధిలో గత నెల 24వ తేదీ నుంచి వాలంటీర్లు, గృహసారథులు జగనన్న సురక్ష క్యాంపులో నమోదు చేసిన సేవలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ చాంద్బాషా, ఎంపీడీవో సౌజన్యకుమారి, తహసిల్దార్ యుగేశ్వరి దేవి, సర్పంచ్ నాగవేణి, ఎంపిటిసి కళ్యాణి, గ్రామ పెద్ద రాజు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.