విశాలాంధ్ర – పెనుకొండ : మండలం పరిధిలోని మావుటూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకార్యకర్త పరమేశ్వర భార్య నాగమణి 28 సంవత్సరాలు వీడికి వివాహమై ఐదు సంవత్సరాలు అయినా సంతానం కలగకపోవడంతో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మంగళవారం వారింటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతోపాటుగా వెంకట రమణ, ప్రసాద్, నంజుoడప్ప నరసింహప్ప, మావు టూరు గోపాల్, త్రివేంద్ర నాయుడు,నాగన్న, నరేష్ మంజు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.