విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రి నుండి ఉదయం ఏడు గంటల కు బయలుదేరి బ్రహ్మంగారి మఠంకు చేరుకొని మరల 12 గంటల సమయంలో బ్రహ్మంగారి మఠం నుండి తాడిపత్రికి బయలుదేరి వచ్చిన AP02 Z 0463 బస్సు కండక్టర్, డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిపో మేనేజర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠంలో 12 గంటలకు బస్సు బయలుదేరి తాలూకా లైన ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఊర్ల మీద మండల మైన కొలింగుంట్ల మండలంలో 3:30 గంటల సమయంలో భోజన సమయ మని కండక్టర్ డ్రైవర్ బస్సు నిలిపారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధులు, చిన్నపిల్లలు, బీపీ, షుగర్ ఉన్న వ్యక్తులు ఉండారు. ఆకలి కొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటల్ యజమానులు ఇచ్చే కమిషన్ కు లేక డ్రైవర్, కండక్టర్ భోజనం భుజించే భోజన ఖర్చు తగ్గుతుందనో మూడున్నర గంటలకు కొలిమిగుండ్లలో నిలబెట్టడం వల్ల హోటల్లో భోజనం అయిపోయింది.కావున డిపో మేనేజర్ బస్సు కండక్టర్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు. ఈ విషయంపై డిపో మేనేజర్ వివరణ కోరగా భోజనం సమయానికి ఒక పాయింట్ లో నిలబెట్టి ప్రయాణికులకు భోజనం చేయించుకుని అనంతరం రావాలని అలా కాకుండా డ్రైవర్ కండక్టర్ నచ్చిన చోట నిలబెడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.