ఎంఈఓ లు.. రాజేశ్వరి, గోపాల్ నాయక్.
విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎంఈఓ.1. రాజేశ్వరి, ఎంఈఓ-2. గోపాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున వీరి ఇరువురిని ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్ర రెడ్డి మాట్లాడుతూ నేడు ఉపాధ్యాయుల సమస్యలు పూర్తి దశలో పరిష్కారం కావడం లేదని, తమరి ద్వారా సమస్యలకు పరిష్కార దిశవకై శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, రాంప్రసాద్, రామాంజనేయులు, విజయభాస్కర్, సాయి గణేష్, జనార్ధన్, ఓబిరెడ్డి, లక్ష్మీనారాయణ, సాకే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.