విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ జన్మదిన సందర్భంగా శుక్రవారం 13వ వార్డులో బిజెపి పట్టణ అధ్యక్షుడు డిష్ రాజు ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాప్తాటి రాము, మైనార్టీ మోర్చా నాయకులు యువ నాయకులు బడగల గిరిధర్, తుంపర్తి పరమేష్, రమ, పావని రాయల్, అచ్యుత సుబ్బరాయుడు, పళ్ళ గోపాల్, గంధమనేని నారాయణస్వామి, పూజారి మల్లికార్జున, రూరల్ అధ్యక్షుడు అరవింద రెడ్డి, ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.