విశాలాంధ్ర-రాప్తాడు : మండలం వివిధ గ్రామాల్లో ఉన్న అనర్హత ఓటర్లను తొలగించాలని తహశీల్దార్ లక్ష్మీనరసింహకు శుక్రవారం టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీఎల్ఓలు వివిధ గ్రామాలలో చనిపోయిన వారిని, రెండు ఓట్లు ఉన్న వారిని, పెళ్లి చేసుకుని ఇతర ప్రాంతాలకు పోయిన వారిని, ఆయా గ్రామాల్లోని ఓటరు జాబితాలో ఉండడంతోపాటు ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటూ అక్కడ కూడా ఓటరు జాబితా నందు వాటిని గుర్తించామన్నారు. వాటిని ఫారం-7 ద్వారా తొలగించడానికి దరఖాస్తు చేశామని అయినా ఎన్నికల అధికారులు తొలగించలేదన్నారు. మరొకసారి అలాంటి వాటిని గుర్తించి తమరికి ఆధారాలతో ఉన్న సీరియల్ నెంబర్, బూత్ నంబర్, ఇంటి చిరునామా వివరాలతో ఉన్న జిరాక్స్ కాపీలను జతపరిచి ఇస్తున్నామన్నారు. కావున వాటిని చరణ చేసి తొలగించవలసిందిగా కోరుతున్నామన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరుకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ కాపీలను పంపుతున్నామన్నారు. కార్యక్రమంలో దండు కేశవ జూటూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.