విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని లింగశెట్టి పాల్యం సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం పై వాలంటీర్లకు సచివాలయ కన్వీనర్లకు గృహ సారథులకు వార్డు కౌన్సిలర్ మాసపల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను శుక్రవారం నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉండి టెక్నికల్గా ఏదైనా సమస్య ఉంటే ప్రతి వాలంటరీ ప్రతి ఇంటికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. పార్టీలకు కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు మేలు జరగాలన్న ఇంత మంచి కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు సురేష్ ,ఓం ప్రకాష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.